Advertisement

  • బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి కరోనా నెగెటివ్

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి కరోనా నెగెటివ్

By: Sankar Sun, 26 July 2020 10:37 AM

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి కరోనా నెగెటివ్



టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా నెగటివ్‌గా తేలింది. అతని సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) సెక్రటరీ స్నేహశీష్ గంగూలీకి ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఇటీవల సౌరవ్ పుట్టినరోజు వేడుకలకి స్నేహశీష్ కూడా హాజరై ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత వారం రోజులుగా దాదా హోం క్వారంటైన్‌లో ఉండిపోయాడు.

క్వారంటైన్‌లో ఉన్న గంగూలీ తాజాగా కరోనా వైరస్ పరీక్ష చేయించుకోగా నెగటివ్‌గా తేలింది. దాంతో.. సోమవారం నుంచి ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణ పనుల్లో సౌరవ్ గంగూలీ బిజీకానున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడటంతో.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఐపీఎల్‌ని ఈ ఏడాది భారత్‌లో కాకుండా యూఏఈలో బీసీసీఐ ప్లాన్ చేసింది.

యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరిన బీసీసీఐ.. గవర్నమెంట్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో టోర్నీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అలానే టోర్నీకి నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లందరూ యూఏఈకి చేరుకోవాలని కూడా ఇప్పటికే ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Tags :
|
|

Advertisement