Advertisement

  • మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ లేదంటే ప్లాన్ బి ని సిద్ధం చేసిన బీసీసీఐ

మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ లేదంటే ప్లాన్ బి ని సిద్ధం చేసిన బీసీసీఐ

By: chandrasekar Thu, 20 Aug 2020 09:11 AM

మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ లేదంటే ప్లాన్ బి ని సిద్ధం చేసిన బీసీసీఐ


మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ జరగనట్లైతే ప్రతామ్నాయంగా ప్లాన్ బి ని సిద్ధం చేసినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ జరిపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ధోనీకి వీడ్కోలు మ్యాచుతో వీడ్కోలు పలుకాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి మొదలుకొని మహి అభిమానులు కూడా కోరుతున్నారు. అయితే, ధోనీ మాత్రం వీడ్కోలు మ్యాచుకు ససేమిరా అంటుండటంతో ప్లాన్ బీ అమలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధోనీ గత ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.

కరోనా కారణంగా టీ 20 వరల్డ్ కప్ టోర్నీ వాయిదా పడటంతో మరో చర్చకు అవకాశం లేకుండా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. ధోనీ నిర్ణయం వెలువడిన గంట తర్వాత మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను పెంచుకున్న ధోనీ సాదాసీదాగా ఆట నుంచి తప్పుకోవడం చాలా మందికి నచ్చడం లేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటుచేయాలని కోరారు. ధోని వీడ్కోలు మ్యాచ్ ధోనీ ఇంటి స్టేడియం ఉన్న రాంచీలోనే జరగాలని ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ఇదే అతడికి ఇచ్చే నిజమైన గౌరవమన్నారు.

ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం భారత జట్టుకు అంతర్జాతీయ సిరీస్ ఏదీ నిర్ణయించలేదు. ఐపీఎల్ తరువాతే మేము ఏదైనా చేయగలమని అలాగే దేశం కోసం చాలా చేసిన ధోనికి సరైన గౌరవం లభించాల్సిందే నని ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఉండాలని మేమూ కోరుకుంటున్నాం. కాని ధోని వేరే రకమైన ఆటగాడు. అతను అకస్మాత్తుగా పదవీ విరమణ ప్రకటించాడు. ఇంత త్వరగా అలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వివరించారు.

గొప్ప కెప్టెన్ ధోని కోసం వీడ్కోలు మ్యాచ్ జరపడానికి బోర్డు మాట్లాడుతుందని తెలిపారు. అందుకు ఆయన అంగీకరించకపోతే గౌరవ వేడుక నిర్వహించేందుకు మా దగ్గర ప్లాన్ బీ రెడీ గా ఉన్నదని ఆయన వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా లెజెండ్ వికెట్ కీపర్ ధోనీ గౌరవ వేడుకను నిర్వహించడం గురించి మాట్లాడారు. ధోని కోసం బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ జరిపితే చాలా సంతోషిస్తాను. అతను గొప్ప ఆటగాడు. మీరు అతన్ని ఇలా వెళ్ళనివ్వలేరు. మాహి అభిమానులు అతడిని మళ్లీ ఆడాలని కోరుకుంటారు అని మదన్ లాల్ అన్నారు. ధోని అభిమానులు ఆయన రిటైర్మెంట్ వార్త వినడంతో చాలా షాక్ కు గురైనారు. ధోనిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉందని మన టీంను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన అతనిని పురస్కరించాల్సి ఉందని తెలిపారు.

Tags :
|

Advertisement