రోహిత్ శర్మ ఫిట్నెస్ పై బీసీసీఐ అధికార ప్రకటన...
By: chandrasekar Sat, 12 Dec 2020 8:11 PM
శుక్రవారం ఎన్సీఏలో
నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో రోహిత్ పూర్తి ఫిట్గా ఉన్నాడని తేలిందని బోర్డు
ప్రకటించింది. ఆస్ట్రేలియా బయల్దేరి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంటాడని పేర్కొంది. ఆ
తర్వాతే జట్టు సభ్యులతో కలుస్తాడని తెలిపింది. ఐపీఎల్లో గాయపడిన రోహిత్ శర్మ ఎన్సీఏలో
రీహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేశాడని వెల్లడించిన బీసీసీఐ అతడు పూర్తి ఫిట్నెస్
సాధించినట్లు ప్రకటించింది.
క్వారంటైన్లో ఉండబోయే 14
రోజులపాటు రోహిత్ ఏమేం చేయాలనేది బీసీసీఐ మెడికల్ టీం పూర్తి వివరాలను
అందజేయనుందన్నారు. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత రోహిత్ను తిరిగి
పరీక్షించనున్నారు. అక్కడ కూడా ఫిట్గా ఉన్నాడని తేలితేనే టెస్టు జట్టులో అతడి
పేరును చేరుస్తారు. డిసెంబర్ 13న రోహిత్ ఆసీస్ బయల్దేరి వెళ్లే అవకాశం దక్కుతుంది.