రోహిత్ ఆసీస్ పర్యటనకు వెళ్తాడు కానీ !
By: Sankar Sun, 13 Dec 2020 07:33 AM
టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ టెస్ట్ లో పాస్ అయి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నాడు ..దీనితో హిట్ మాన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు ..ఇప్పటికే తొలి టెస్ట్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇండియా రావడం ఖాయం కావడంతో రోహిత్ వంటి సీనియర్ ఆటగాడి అవసరం టీం ఇండియాకు చాల ఉంది ..అయితే రోహిత్ ఫిట్ నెస్ పై బీసీసీఐ ప్రకటన చేసింది
అతను ఆస్ట్రేలియాకు వెళుతున్నాడని... అయితే టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగే విషయంపై మాత్రం ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. ఆస్ట్రేలియాలో భారత జట్టుతో పాటు ఉన్న బోర్డు వైద్య బృందం రోహిత్ ఫిట్నెస్ను పునఃసమీక్షించిన తర్వాతే ఆడే విషయం తెలుస్తుందని స్పష్టం చేసింది.
‘ఐపీఎల్లో గాయపడిన రోహిత్ ఎన్సీఏలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ‘క్లినికల్లీ ఫిట్’గా ఉన్నాడు. అతని బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని పరీక్షించిన ఎన్సీఏ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే అతను సుదీర్ఘ సమయం పాటు ఆడే అంశంలో మెరుగుపడాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్ ముగిసిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం రోహిత్ ఫిట్నెస్ను మళ్లీ పరీక్షిస్తుంది. దీనిని బట్టే మ్యాచ్ ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటారు’ అని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.