Advertisement

  • భారత్ లో జరిగే టి ట్వంటీ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సౌరవ్ గంగూలీ

భారత్ లో జరిగే టి ట్వంటీ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సౌరవ్ గంగూలీ

By: Sankar Fri, 13 Nov 2020 07:20 AM

భారత్ లో జరిగే టి ట్వంటీ ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన సౌరవ్ గంగూలీ


ఈ ఏడాది ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అదే వచ్చే ఏడాది భారత వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీ20 ప్రపంచ కప్ యొక్క ట్రోఫీని ఆవిష్కరించారు. మొత్తం 16 జట్లు పాల్గొననున్న ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించనున్నారు. అయితే చివరిసారిగా భారత్ లో 2016 లో టీ20 ప్రపంచ కప్ టోర్నీని నిర్వహించారు.

అందులో భారత్ ను సెమీస్ లో ఓడించిన వెస్టిండీస్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి టైటిల్ అందుకుంది. మరి వచ్చే ఏడాది ఆ టైటిల్ ఏ జట్టు అందుకోనుంది అనేది చూడాలి.కరోనా ఉన్న కూడా ఐపీయల్ ను విజయవంతం చేసిన బీసీసీఐ ఇక తదుపరి టి ట్వంటీ ప్రపంచ కప్ పై ద్రుష్టి పెట్టింది..

Tags :
|
|

Advertisement