- హోమ్›
- వార్తలు›
- వచ్చే ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లీ కెప్టెన్సీ మీదనే ఇండియా విజయం ఆధారపడి ఉంది ... సౌరవ్ గంగూలీ
వచ్చే ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లీ కెప్టెన్సీ మీదనే ఇండియా విజయం ఆధారపడి ఉంది ... సౌరవ్ గంగూలీ
By: Sankar Sun, 08 Nov 2020 8:03 PM
కరోనా లాక్ డౌన్ మురిగిసిన తర్వాత ప్రెకషకులు లేకుండా వరుసగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి ..ఇప్పటికే ఐపీయల్ యూఏఈ లో స్టార్ట్ అయి విజయవంతంగా జరుగుతుంది..ఇక ఈ ఐపీయల్ అయిపోయిన వెంటనే ఇండియా ఆస్ట్రేలియా తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది ..
అయితే ఆస్ట్రేలియా టూర్లో టీమ్ ఇండియా విజయాలు కోహ్లీ కెప్టెన్సీపైనే ఆధారపడి ఉంటాయన్నారు BCCI అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. గతం ఆస్ట్రేలియా టూర్లో 2-1 తేడాతో భారతో భారత్ చారిత్రక టెస్టు విజయం సాధించింది. అయితే, అప్పుడు వార్నర్, స్టీవ్స్మిత్ లేరు. ప్రస్తుతం ఆ ఇద్దరికి తోడు మార్నస్ లబుషేన్ సైతం ఆ జట్టులో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ రాణించడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
దీంతో టీమిండియా విజయాలు విరాట్ నాయకత్వంపైనే ఆధారపడ్డాయని అభిప్రాయపడ్డారు గంగూలీ. బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవాలని, ఎవరిని ఎప్పుడు ఎలా ఆడించాలో కోహ్లీయే చూసుకోవాలన్నారు గంగూలీ.