Advertisement

  • భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ

By: Sankar Fri, 25 Dec 2020 10:11 AM

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ


భారత క్రికెట్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ పేస్‌ బౌలర్‌ చేతన్‌ శర్మ (నార్త్‌ జోన్‌) ఎంపికయ్యాడు. గురువారం జరిగిన బీసీసీఐ ఎజీఎంలో ఈ ఎంపికను ఖరారు చేశారు.

చేతన్‌తో పాటు సెలక్షన్‌ కమిటీలో మాజీ పేసర్లు అబయ్‌ కురువిల్లా, దేవాశీష్‌ మొహంతి లకు కూడా అవకాశం దక్కింది. మదన్‌ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లు సభ్యులుగా ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త సెలక్టర్లను ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీలో ఇప్పటికే సునీల్‌ జోషి, హర్వీందర్‌ సింగ్‌ ఉన్నారు.

కొత్తగా ఎంపికైన ముగ్గురు వీరితో జత కలుస్తారు. ఇప్పటి వరకు జోషి చైర్మన్‌గా వ్యవహరించినా... నిబంధనల ప్రకారం ఐదుగురిలో ఎక్కువ టెస్టులు ఆడిన చేతన్‌ శర్మ ఇకపై చీఫ్‌ సెలక్టర్‌ హోదాలో పని చేస్తాడు. వెస్ట్‌ జోన్‌నుంచి చివరి నిమిషం వరకు అజిత్‌ అగార్కర్‌ పేరు వినిపించినా... అనూహ్యంగా కురువిల్లాకు అవకాశం లభించింది...

Tags :
|

Advertisement