ఆస్ట్రేలియా పర్యటనకి భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ... రోహిత్ శర్మ ఎంపిక కాలేదు
By: chandrasekar Tue, 27 Oct 2020 03:28 AM
సోమవారం భారత క్రికెట్
నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆస్ట్రేలియా పర్యటనకి భారత్ జట్టుని ప్రకటించింది.
నవంబరు 10న
ఐపీఎల్ 2020 సీజన్
ముగియనుండగా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లనున్న టీమిండియా నవంబరు 27 నుంచి
మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20లు, డిసెంబరు
17 నుంచి
నాలుగు టెస్టులని ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మేరకు టీ20, వన్డే, టెస్టు
జట్లని ఈరోజు వేర్వేరుగా బీసీసీఐ
ప్రకటించింది. గాయం కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లకి దూరంగా ఉంటున్న ఓపెనర్
రోహిత్ శర్మ ఫిట్నెస్పై క్లారిటీ రాకపోవడంతో అతడ్ని ఏ ఫార్మాట్లోకీ సెలక్టర్లు
ఎంపిక చేయలేదు. అతని స్థానంలో ఇటీవల ఐపీఎల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన
ఓపెనర్ శిఖర్ ధావన్ని ఎంపిక చేశారు.
భారత టీ20
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్
కీపర్), శ్రేయాస్
అయ్యర్, మనీశ్
పాండే, హార్దిక్
పాండ్య, సంజు
శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేందర్ చాహల్, జస్ప్రీత్
బుమ్రా, మహ్మద్
షమీ, నవదీప్
సైనీ, దీపక్
చాహర్, వరుణ్
చక్రవర్తి.
భారత వన్డే జట్టు: విరాట్
కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, వైస్
కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్
సైనీ, శార్ధూల్
ఠాకూర్.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ
విహారి, శుభమన్
గిల్, సాహా
(వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్
బుమ్రా, మహ్మద్
షమీ, ఉమేశ్
యాదవ్, నవదీప్
సైనీ, కుల్దీప్
యాదవ్, రవీంద్ర
జడేజా, రవిచంద్రన్
అశ్విన్, మహ్మద్
సిరాజ్.