Advertisement

  • భారత్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పర్యటన షెడ్యూల్ విడుదల

భారత్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పర్యటన షెడ్యూల్ విడుదల

By: Sankar Thu, 10 Dec 2020 6:22 PM

భారత్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పర్యటన షెడ్యూల్ విడుదల


భారత్ లోఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.. ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ... మొదటి, రెండో టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వగా, అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మోతెర స్టేడియం మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

అయితే ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో డే-నైట్ టెస్ట్ మార్చి 4న చివరకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత అక్కడే అహ్మదాబాద్‌లోనే మార్చి 12న 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరుగుతుంది. అలాగే చివరకు పూణే వేదికగా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మార్చి 23న ఆరంభమవుతుంది.

ఇక ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా , ఇంగ్లాండ్ మాత్రం సౌత్ ఆఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వైదొలిగింది..సౌత్ ఆఫ్రికా ,ఇంగ్లాండ్ జట్లలోనే కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఆ రెండు జట్ల మధ్య జరగాల్సిన వన్ డే సిరీస్ కరోనా కారణంగా రద్దు అయింది..దీనితో ఇంగ్లాండ్ జట్టు స్వదేశం బయలుదేరింది

Tags :
|
|

Advertisement