Advertisement

మహిళల ఐపీయల్ తేదీలను ప్రకటించిన బీసీసీఐ

By: Sankar Sun, 11 Oct 2020 1:55 PM

మహిళల ఐపీయల్ తేదీలను ప్రకటించిన బీసీసీఐ


కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ నవంబర్ 10 న ముగుస్తుంది. అయితే బీసీసీఐ అధికారులు పురుషుల ఐపీఎల్ ముగిసే చివరి 10 రోజులు అంటే నవంబర్ 1-10 వరకు యూఏఈ వేదికగానే మహిళల ఐపీఎల్ జరుగుతుంది అని గతంలో జరిచిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ప్రకటించారు.

అయితే ఈ రోజు ఆ తేదీలను ప్రకటించింది బీసీసీఐ. నవంబర్ 4 నుండి 9 వరకు యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్ జరుగుతుంది అని ట్విట్టర్ వేదికగా బీసీసీఐ తెలిపింది. ఇక గత సీజన్ లో ఈ లీగ్ లో కేవలం 3 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం 4 జట్లతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు దాదా చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా 3 జట్లతోనే బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహిస్తుంది.

ఈ మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, మిథాలీ రాజ్ న్యాయకత్వం వహించనున్నారు.ఇక పురుషుల ఐపీఎల్ కు ఏ విధమైన కరోనా నియమాలు వర్తిస్తాయో మహిళల ఐపీఎల్ కు కూడా అవే నియమాలు వర్తిస్తాయి. మరి మహిళలు యూఏఈ కి ఎప్పుడు వెళ్తారు అనే విషయం ఇంకా తెలియదు.

Tags :
|
|

Advertisement