Advertisement

ఆ రాష్ట్రంలో బార్లు , క్లబ్బులకు అనుమతి..

By: Sankar Thu, 03 Sept 2020 8:40 PM

ఆ రాష్ట్రంలో బార్లు , క్లబ్బులకు అనుమతి..


కరోనా మహమ్మారి వలన విధించిన అన్ని నిబంధనలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి..ఆన్ లాక్ 4 లో భాగంగా ఇప్పటికే కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది..ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో ట్రైన్స్ నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ ప్రభుత్వం , తాజాగా బారులకు అనుమ‌తి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్‌ను ఇటీవ‌లే కోరింది.

కేంద్రం విడుద‌ల చేసిన అన్‌లాక్-4 మార్గ‌ద‌ర్శకాల‌ను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్ర‌భుత్వం కోరిన‌ట్లు ఢిల్లీలో బార్ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అనిల్ బైజ‌ల్ తెలిపారు. ఈ మేర‌కు సెప్టెంబ‌ర్ 9 నుంచి 30వ‌ర‌కు ట్ర‌య‌ల్ ప‌ద్ద‌తిలో బార్ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

బార్ల‌తో పాటు హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క్ల‌బ్బుల్లో ప‌రిమిత సంఖ్య‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గ‌ద‌ర్శకాల ప్ర‌కార‌మే బార్ల‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు తెలిపింది. గ‌త శ‌నివారం కేంద్రం విడుద‌ల చేసిన అన్‌లాక్‌-4 మార్గ‌ద‌ర్శకాల్లో ప్ర‌ధాన న‌గ‌రాల్లోని మెట్రో సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించాల‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పాటు ష‌ర‌తుల‌తో కూడిన విధంగా బార్ల‌ను తె‌రుచుకునేందుకు అనుమ‌తులు ఇచ్చింది.

కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం గోవా, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమ‌తులు ఇచ్చాయి. బార్ల‌కు అనుమ‌తులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబ‌ర్ 9 నుంచి 30 వ‌ర‌కు ఢిల్లీలోని వివిధ బార్లు అనుస‌రించాల్సిన మార్గ‌ద‌ర్శకాల‌ను ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది

Tags :
|
|
|

Advertisement