తెలంగాణాలో రోడ్డెక్కని బస్సులు
By: Sankar Tue, 08 Dec 2020 09:43 AM
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్కు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి.
భారత్బంద్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్టీసీ బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.
ఉమ్మడి నల్గొండ రైతుల సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్, వామపక్ష నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు ఏడు ఆర్టీసీ డిపోల్లో 600 బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి -నార్కెట్ పల్లి రహదారి, హైదరాబాద్ - సాగర్ రహదారి, హైదరాబాద్-వరంగల్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి..
ఖమ్మం డిపో ఎదుట టీఆర్ఎస్ శ్రేణులు, పలు పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి. అలాగే హైదరాబాద్లో బంద్కు ఆర్టీసీ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. హకీంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు తెలిపారు