Advertisement

  • బాపు గారి సోదరులైన శ్రీ శంకర నారాయణ గారు అనారోగ్యంతో కన్నుమూత

బాపు గారి సోదరులైన శ్రీ శంకర నారాయణ గారు అనారోగ్యంతో కన్నుమూత

By: chandrasekar Fri, 10 July 2020 11:56 AM

బాపు గారి సోదరులైన శ్రీ శంకర నారాయణ గారు అనారోగ్యంతో కన్నుమూత


ఒకవైపు కరోనా కారణంగా థియేటర్స్‌ మూతపడితే మరోవైపు చిత్ర రంగానికి సంబంధించిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కన్నుమూయడం ఎంతో విషాదకరం. 2020 సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. నిన్నటి నిన్న బాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ కమెడియన్ జగ్‌దీప్ కన్నుమూయగా అంతకు కొన్ని గంటల ముందు ఎంతో భవిష్యత్తు ఉన్న కన్నడ సీరియల్ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకోవడంతో చిత్ర తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది.

ఈ విషాదకర సంఘటనలు మరవక ముందే ప్రముఖ దర్శకులు బాపు గారి సోదరులైన శ్రీ శంకర నారాయణ గారు ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన అమర జీవి అనే స్వచ్ఛంద సేవా సమితిని ఏర్పాటు చేసి బీద సాదాలకు ఎన్నో సేవలు కూడా చేసారు. అంతేకాదు అన్న బాపు వలే ఈయన కూడా ప్రముఖ చిత్రకారుడుతో పాటు కార్టూనిస్ట్. ఈయన అమరజీవి సమితి తరుపున సన్మాన కార్యక్రమాలను పొందిన వారి చిత్ర పటాలను గీసి ఉచితంగా అందించే వారు.

బాపుగారి వలే శంకరనారాయణ గారు కూడా చాలా మృదు స్వభావి. తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎప్పుడూ ప్రచారం కోరుకోని వ్యక్తి శంకర నారాయణ గారు. ఈయన వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా కన్నమూశారు. ఆయన మృతిపై వారి కుటుంబానికి, బాపురమణల కుటుంబాలకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. అంతేకాదు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితితో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ కార్టూనిస్ట్ యూనియర్ కూడా శంకర నారాయణ మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేసారు.

Tags :
|
|

Advertisement