Advertisement

  • కారు పార్కింగ్ చేస్తూ చెట్టుకు కార్ డోర్ కు మధ్యలో ఇరుక్కొని మహిళ మృతి

కారు పార్కింగ్ చేస్తూ చెట్టుకు కార్ డోర్ కు మధ్యలో ఇరుక్కొని మహిళ మృతి

By: Sankar Thu, 08 Oct 2020 10:36 PM

కారు పార్కింగ్ చేస్తూ చెట్టుకు కార్ డోర్ కు మధ్యలో ఇరుక్కొని మహిళ మృతి


కొన్ని సార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద నష్టాలను మిగుల్చుతాయి. అలాంటి సంఘటన ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులోని సదాశివనగర్‌లోబుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో టెక్కి అయిన నందిని రావ్‌(45) అనే మహిళ మృతి చెందింది.

రివర్స్‌ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టు, కారు డోర్‌ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది. నందిని రావు(45) కొడుకును ఆడిస్తూ బయటకు వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి ఉన్న కారు డోర్ తీసింది. రివర్స్‌ గేర్‌లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. అయితే ఆ సమీపంలోనే చెట్టు ఉంది.

దీంతో కారు తలుపుకు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం కేకలు వేసింది. స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. కారు పార్కింగ్‌కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Tags :

Advertisement