బెంగళూర్లో కలకలం...మరో ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్న ఎన్ఐఏ...
By: chandrasekar Thu, 29 Oct 2020 6:20 PM
కర్ణాటక రాజధాని బెంగళూర్లోని
ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం (
ఎన్ఐఏ) ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకుంది.
ఎస్ఐఏ అధికారులు ఐఎసీఎస్తో
ఈ ఇద్దరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని విచారిస్తున్నారు. త్వరలో
పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
గత 20 రోజుల
క్రితం ఐసీఎస్తో సంబంధమున్న ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిని తమిళనాడుకు
చెందిన అబ్దుల్ అహ్మద్ కదీర్ (40),
బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్ నజీర్గా గుర్తించారు.
ఇటీవల బెంగళూర్లో
ఉగ్రవాద స్థావరం బయటపడినాటి నుంచి ఎన్ఐఏ పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది.
పట్టుబడిన వారి నుంచి తీగలాగి ఉగ్రవాదులను అరెస్టు చేస్తోంది. వరుసగా బెంగళూర్లో
ఉగ్రవాదులు పట్టుబడుతుండటం నగరంలో కలకలం రేపుతోంది.