కోల్కతా పై కీలక వికెట్లు తీసిన బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్
By: chandrasekar Thu, 22 Oct 2020 09:22 AM
కోల్కతా నైట్రైడర్స్తో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టే బౌలింగ్ ను ప్రదర్శించింది. పేసర్ మహ్మద్
సిరాజ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఐపీఎల్ 2020 లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో
ఆకట్టుకున్నాడు. కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో సిరాజ్ అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని
గడగడలాడించాడు.
మంచి లైన్ అండ్ లెంగ్త్
తో పదునైన పేస్తో బెంబేలెత్తించిన సిరాజ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.
సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(1) వికెట్
కీపర్ డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే
క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా(0) బౌల్డ్ అయ్యాడు. నవదీప్ సైనీ వేసిన మూడో ఓవర్లో
మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్ ఆడగా మిడాన్లో
క్రిస్మోరీస్ చేతికి చిక్కాడు.
మంచి ఫామ్ లో నున్న
సిరాజ్ తను వేసిన నాలుగో ఓవర్లోనే టామ్ బాంటన్(10) కూడా కీపర్ ఏబీడీకి
క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కోల్కతా 14 పరుగులకే నాలుగు
వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 6 ఓవర్లకు కోల్కతా 4
వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసింది. చివరగా కోల్కతా 20 ఓవర్
లకు 84 పరుగులైనా చేయగలిగింది. ఈ స్కోర్ ను రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.