Advertisement

  • కరోనా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్

కరోనా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్

By: Sankar Wed, 17 June 2020 3:42 PM

కరోనా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్



భారత్-చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన సైనికులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను అరికడుతున్న తీరుపై ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిపై బీజేపీ మొదటి నుంచి హెచ్చరిస్తున్నా కేసీఆర్‌ పెడచెవిన పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం వ్యవహారం చూస్తుంటే ఆయన నిద్రలో నుంచి లేచి ప్రకటనలు ఇస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

కరోనా టెస్టులు పెంచాలని తాము మొదటి నుంచి కోరుతున్నా కేసీఆర్ దాన్ని పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 44 వేల టెస్టులే చేయడం దారుణమని.. తాజాగా 50 వేల టెస్టులు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఆ ప్రకటన చేసిన వారే వాటిని ఏ ప్రాతిపదికన చేస్తారో మాత్రం చెప్పరని వ్యాఖ్యానించారు. తన చేతకాని తనాన్ని కేసీఆర్‌ కేంద్రం మీద నెడుతున్నారని మండిపడ్డారు.

కరోనా నేపథ్యంలో సాక్షాత్తు గవర్నర్‌ తమిళిసై కొవిడ్ ఆస్పత్రులను సందర్శిస్తుంటే సీఎం కేసీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గచ్చిబౌలిలోని 1,500 పడకల టిమ్స్‌ (కొవిడ్ ఆస్పత్రి) హాస్పిటల్‌ సంగతి ఏమైందని ప్రశ్నించారు. చికిత్సలు చేయకుండా కరోనా పాజిటివ్‌ వచ్చిన పేషంట్‌లను ఎందుకు హోం క్వారంటైన్‌కు పంపుతున్నారని నిలదీశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడమో లేదా ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చి పేద ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విచిత్రమైన ధోరణితో జోకర్‌లా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags :
|

Advertisement