జనసేన సహా ఏ పార్టీతో కూడా పొత్తు లేదన్న బండి సంజయ్
By: chandrasekar Tue, 17 Nov 2020 7:57 PM
జీహెచ్ఎంసీ - గ్రేటర్
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో జనసేన
సహా ఏ పార్టీతో కూడా పొత్తు లేదన్న బండి సంజయ్. జనసేన సహా ఏ పార్టీతో కూడా పొత్తు
ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తమను ఎవరూ పొత్తుల గురించి సంప్రదించలేదని
బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వేళ బండి
సంజయ్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు జీహెచ్ఎంసీ
ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్
ఓ ప్రకటన జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ
చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ
పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ
అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వీరికోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం యువ జనసైనికుల
వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర
పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల
ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు
డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన
నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ
చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు. వారి అభీష్టానికి
అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది. అని ఆ
ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఎన్నికల హడావుడి మొదలైంది గెలుపెవరిదో వేచి
చూడాల్సిందే.