Advertisement

  • గణేష్ ఉత్సవాలకు కెసిఆర్ ప్రభుత్వం కావాలనే అడ్డంకులను సృష్టిస్తుంది ..బీజేపీ ఎంపీ బండి సంజయ్

గణేష్ ఉత్సవాలకు కెసిఆర్ ప్రభుత్వం కావాలనే అడ్డంకులను సృష్టిస్తుంది ..బీజేపీ ఎంపీ బండి సంజయ్

By: Sankar Fri, 21 Aug 2020 05:47 AM

గణేష్ ఉత్సవాలకు కెసిఆర్ ప్రభుత్వం కావాలనే అడ్డంకులను సృష్టిస్తుంది ..బీజేపీ ఎంపీ బండి సంజయ్


పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణపై టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను దీటుగా ఎదుర్కొంటామ‌ని తెలిపారు. గణేష్ ఉత్సవ నిర్వహకులకు అండగా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న సమయంలో రంజాన్ నెలలో బిర్యానీలు, కాజు పిస్తాలు అందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం గణేష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించకుండా కుట్రలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

ఒవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఏటా గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తూ ఉండడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారింద‌ని బండి సంజ‌య్ ధ్వజమెత్తారు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల‌ని కోరారు. సంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించడం హిందూ సమాజానికి సహజమైన అలవాటని ఆయన గుర్తు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గణేశ్ ఉత్సవాలపై అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉత్సవ నిర్వహకులపై పోలీసులతో కేసీఆర్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంద‌ని విమర్శించారు.

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం అందరి బాధ్యత అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బండి సంజయ్ సూచించారు.

Tags :
|

Advertisement