నాగార్జున సాగర్ లో సందడి చేసిన బాడ్మింటన్ స్టార్ పివి సింధు
By: Sankar Sun, 27 Sept 2020 2:45 PM
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నాగార్జున సాగర్లో సందడి చేశారు. ఆదివారం ఉదయం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి సాగర్ సందర్శించారు. సింధూ ప్రాజెక్ట్ వద్ద కుటుంబీకులతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. సాగర్ చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ను దగ్గరుండి చూపించారు.
కాగా ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదలడంతో ఆ సుందర దృశ్యాలను చూడటానికి పర్యాటకులు సాగర్ చేరుకుంటున్నారు.మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 20 క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇక మరోవైపు విజయవాడలో గల ప్రకాశం బ్యారేజీకి కి కూడా వరద నీటి ఉదృతి తీవ్ర స్థాయిలో ఉంది..పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో 4లక్షల 2 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3లక్షల 97వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రనికి 6 లక్షల క్యూసెక్కులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.