- హోమ్›
- వార్తలు›
- సెహ్వాగ్ కాదనడంతో ధోనీని వరించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బద్రీనాథ్
సెహ్వాగ్ కాదనడంతో ధోనీని వరించిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ..ఆసక్తికర విషయాలు వెల్లడించిన బద్రీనాథ్
By: Sankar Sun, 13 Sept 2020 1:02 PM
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే ముందుగా గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. రెండు సీజన్లపాటు టోర్నీకి దూరమైనప్పటికీ.. ఆ జట్టు ఇప్పటి వరకూ మూడుసార్లు విజేతగా నిలవడంతోపాటు.. ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్ చేరింది. ధోనీ అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోనీ అనేంతలా ఈ ఫ్రాంచైజీకి గుర్తింపు లభించింది.
కానీ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు.. తమ కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకుందట. ఫస్ట్ చాయిస్ కెప్టెన్గా వీరూను తీసుకుంటామని శ్రీనివాసన్ కూడా చెప్పారు. వేలంలో ఎలాగైనా సరే వీరూను దక్కించుకోవాలని భావించిదట. కానీ తను పుట్టి పెరిగింది ఢిల్లీ కావడంతో.. ఢిల్లీ డేర్డేవిల్స్ తరఫున ఆడేందుకే సెహ్వాగ్ మొగ్గు చూపాడు. ఢిల్లీ ఐకాన్ ప్లేయర్గా ఎంపిక చేసుకోవడంతో.. వేలంలో అందుబాటులో లేకుండా పోయాడు.
దీనితో చెన్నై ఓనర్ శ్రీనివాసన్ ధోని ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ధోని ని దక్కించుకోవడం కోసం ముంబై ఇండియన్స్తో పోటీ పడ్డారు. చివరకు 1.5 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి మహీని చెన్నై దక్కించుంది. ఆ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ధోనీనే కావడం విశేషం.ఈ ఆసక్తికర విషయాలను భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ సుబ్రమణియం బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించాడు.