Advertisement

అయోధ్య రామమందిరం భారతీయ సాంస్కృతిక వైభవం

By: chandrasekar Wed, 05 Aug 2020 2:59 PM

అయోధ్య రామమందిరం భారతీయ సాంస్కృతిక వైభవం


అయోధ్య రామమందిరం భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా, మన అధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా ఆలయ ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిరం సర్వాంగ సుందరంగా నిర్మితం కాబోతోంది. కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడుతోంది.

ఆగస్టు 5న భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా మందిరాన్ని నిర్మించనున్నారు. భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ayodhya,ram mandir,cultural,landmark,india ,అయోధ్య, రామమందిరం, భారతీయ, సాంస్కృతిక, వైభవం


భారతీయ అధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం చేపట్టనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌‌లో పేర్కొంది. సుమారు 3 నుంచి మూడున్నరేళ్లలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. నమూనా ఆకృతుల ప్రకారం మొత్తం 5 గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ప్రముఖ శిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పుర ఈ ఆలయాన్ని డిజైన్‌ చేశారు. ఆయన వయసు 77 ఏళ్లు. ప్రస్తుతం ఆయన దేశంలో నిర్మించ తలపెట్టిన 8 ఆలయాలకు డిజైన్లు రూపొందిస్తున్నారు. శిల్ప శాస్త్రంపై ఆయన 12 పుస్తకాలను రచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టా్త్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్‌పుర కుటుంబమే రూపొందించడం విశేషం. రామ మందిర నమూనాల కోసం తనను 30 ఏళ్ల కిందటే సంప్రదించినట్లు చంద్రకాంత్ సోమ్‌పుర తెలిపారు. అప్పట్లోనే డిజైన్ రూపొందించినట్లు వెల్లడించారు. ఆ ఆకృతిలో ప్రస్తుత శైలికి తగినట్లు కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు.

ayodhya,ram mandir,cultural,landmark,india ,అయోధ్య, రామమందిరం, భారతీయ, సాంస్కృతిక, వైభవం


ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణం ఉండనుంది. ముందుగా అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగులు పెంచినట్లు శిల్పులు తెలిపారు. ఆలయ సముదాయంలో ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం కావచ్చని చెబుతున్నారు. భారతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మందిర నిర్మాణం భూమి పూజ కోసం దేశంలోని 2000 ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చారు. 101 నదుల నుంచి నీటిని తీసుకొచ్చారు. భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Advertisement