నేటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా నాలా దరఖాస్తులకు అందుబాటులోకి...
By: chandrasekar Wed, 16 Dec 2020 3:43 PM
తెలంగాణా రాష్ట్రంలో
సోమవారం నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై౦ది. నేటి నుంచి
నాలా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు .
పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 59,294 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. దీనికోసం
80,947 మంది స్లాట్లు బుక్చేసుకోగా రూ.87.02 కోట్ల ఆదాయం వచ్చింది.
దీనితోపాటు ఈ రోజు నుండి
వ్యవసాయేతర భూముల నాలాగా కన్వర్షన్తోపాటు ధరణికి ముందు రిజిస్ట్రేషన్ అయిన
వ్యవసాయభూముల మ్యుటేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
పెండింగ్ మ్యుటేషన్లకు
ధరణి పోర్టల్ ద్వారా 7058 వ్యవసాయ భూముల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
ఇప్పటివరకు స్లాట్బుకింగ్ల కోసం 2,427 మంది రూ.43.62 కోట్లు చెల్లించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్ఆర్వోల్లో
నిన్న 140
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం 82
రిజిస్ట్రేషన్లు, బుధవారం రిజిస్ట్రేషన్ల కోసం 433 మంది
స్లాట్ బుక్ చేసుకున్నారు.