బుమ్రా బౌలింగ్ లో ఆడితేనే బాట్స్మన్ గా మన సత్తా ఎంతో తెలుస్తుంది ...మార్నస్ లబూషేన్
By: Sankar Mon, 20 July 2020 12:26 PM
ఇటీవల నిలకడగా రాణిస్తూ ఆసీస్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన ఆటగాడు లబూషేన్. 2020–21 సీజన్కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో స్థానం దక్కించుకున్న లబూషేన్. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అవకాశం ఉండటంతో బుమ్రాపై లబ్షేన్ ప్రశంసలు కురిపించాడు. ‘గంటకు 140 కి.మీల వేగంతో నిలకడా బౌలింగ్ చేయగల సత్తా బుమ్రాది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్ను రాబట్టడంలో కూడా బుమ్రా దిట్ట. అందుకే బుమ్రా బౌలింగ్ ఆడటం చాలా కష్టం..
భారత్ పేస్ దళం చాలా మెరుగ్గా ఉంది. అందులో బుమ్రా ప్రమాదకర బౌలర్. నీకు నువ్వు బ్యాట్స్మన్గా పరీక్షించుకోవాలంటే బుమ్రా బౌలింగ్ను ఆడితేనే సత్తా బయటకొస్తుంది. టీమిండియా పేస్ దళానికి బుమ్రానే లీడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను భారత్లో ఒకే టెస్టు మ్యాచ్ ఆడాను. గతంలో సిడ్నీ మ్యాచ్లో భారత్తో మ్యాచ్ ఆడా. నాకు భారత్ బౌలింగ్ను ఆడటంలో కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది.
ఇక పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత్కు వచ్చా. టెస్టుల్లో పరంగా చూస్తే భారత్ బౌలింగ్ను చాలా తక్కువగానే ఆడాను. టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్లో ఇషాంత్ శర్మ కూడా బాగా మెరుగయ్యాడు. రాబోయే సిరీస్ల్లో భారత నుంచి బాగా గట్టి పోటీ తప్పదు’ అని బ్రిస్బేన్లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో లబూషేన్ పేర్కొన్నాడు..ఇక ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్లు ఆడిన లబూషేన్ 63పైగా యావరేజ్తో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.