సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా...
By: chandrasekar Thu, 03 Dec 2020 2:08 PM
ఆస్ట్రేలియా క్రికెట్
జట్టు ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో
అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
భారత్తో మూడు వన్డేల
సిరీస్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన
ఆసీస్ 2-1తో సిరీస్ను
చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి
రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోగా ఆఖరిదైన మూడో వన్డేలో కోహ్లీసేన
విజయం సాధించింది. సిరీస్ అనంతరం సూపర్ లీగ్ పాయింట్లను ఐసీసీ విడుదల చేసింది.
పురుషుల క్రికెట్ ప్రపంచ
కప్ సూపర్ లీగ్లో 40 పాయింట్లతో ఆస్ట్రేలియా(ఆడింది ఆరు మ్యాచ్లు )
నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
ఆఖరి మ్యాచ్లో విజయం
సాధించిన భారత్( మూడు మ్యాచ్లు)
తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. భారత్ ఖాతాలో ఒక పెనాల్టీ
ఓవర్ ఉంది.
ఇంగ్లాండ్(6
మ్యాచ్లు) 30 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా పాకిస్థాన్(3
మ్యాచ్లు) 20 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.