Advertisement

  • టీంఇండియా ఆటగాడు రాహుల్ కు క్షమాపణలు చెప్పిన మాక్స్ వెల్

టీంఇండియా ఆటగాడు రాహుల్ కు క్షమాపణలు చెప్పిన మాక్స్ వెల్

By: Sankar Sat, 28 Nov 2020 8:11 PM

టీంఇండియా ఆటగాడు రాహుల్ కు క్షమాపణలు చెప్పిన మాక్స్ వెల్


ఇండియా తో తాజాగా జరుగుతున్న వన్ డే సిరీస్ లో నిన్న సిడ్నీ లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే..అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ మెరుపు బాటింగ్ చేసాడు..

అయితే మ్యాక్స్‌వెల్‌ తాజా ప్రదర్శనపై విమర్శల వర్షం కురిసింది. కనీసం ఇలా ఐపీఎల్‌ ఒక్క మ్యాచ్‌లో ఆడుంటే కింగ్స్‌ పంజాబ్‌ పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు విమర్శించారు. ఇక న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ కూడా ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌ జరిగిన తొలి టీ20లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి న్యూజిలాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దీనిపై ఒక అభిమాని సెటైర్‌ వేశాడు. ‘మీ దేశాలకు ఆడేటప్పుడు ఎంతటి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారో కేఎల్‌ రాహుల్‌ చూశాడు’ అంటూ సరదాగా పోస్ట్‌ చేశాడు. అవును.. నిజంగానే మంచి ఇన్నింగ్స్‌లు ఆడాం’ అంటూ నీషమ్‌ బదులిచ్చాడు. అదే సమయంలో మ్యాక్సీ కూడా రిప్లై ఇస్తూ తాను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలోనే కేఎల్‌ రాహుల్‌కు క్షమాపణలు చెప్పాను’ అని పేర్కొన్నాడు

Tags :

Advertisement