గాయంతో టి ట్వంటీ సిరీస్ కు వార్నర్ దూరం
By: Sankar Tue, 01 Dec 2020 10:11 AM
ఇండియా తో జరుగుతున్న వన్ డే సిరీస్ లో ఆస్ట్రేలియా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ..ఇప్పటికే వరుసగా రెండు వన్ డే లలో గెలిచి ఊపు మీద ఉన్న కంగారు జట్టుకు వార్నర్ గాయం షాకిచ్చింది...దీనితో మూడో వన్ డే తో పటు టి ట్వంటీ సిరీస్ కు వార్నర్ దూరం కానున్నాడు...
రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయానికి చికిత్సతో పాటు వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం కావాలని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... టెస్టు సిరీస్కల్లా అతను ఫిట్గా ఉండాలని కోరుకుంటోంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్ను ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.
మరోవైపు ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్కు మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్ల నుంచి విశ్రాంతి కల్పించింది. అతను కూడా రేపు జరిగే వన్డేతో పాటు టి20 సిరీస్లో బరిలోకి దిగడు. ‘వార్నర్, కమిన్స్ మా టెస్టు జట్టు ప్రణాళికల్లో ఎంతో కీలక ఆటగాళ్లు. వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కమిన్స్కు మాత్రం ఫిట్గా ఉండేందుకు కొంత విరామం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.