Advertisement

  • ఇంగ్లాండ్ టూర్ లో రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా పరాజయం

ఇంగ్లాండ్ టూర్ లో రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా పరాజయం

By: chandrasekar Mon, 07 Sept 2020 5:29 PM

ఇంగ్లాండ్ టూర్ లో రెండో టీ20లోనూ ఆస్ట్రేలియా పరాజయం


రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 157 పరుగులు చేయగా లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ 158/4తో ఛేదించేసింది.టీమ్‌ని గెలిపించిన ఓపెనర్ జోస్ బట్లర్ (77 నాటౌట్: 54 బంతుల్లో 8x4, 2x6)‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తాజా విజయంతో మూడు టీ20ల సిరీస్‌ని 2-0తో ఇంగ్లాండ్ చేజిక్కించుకోగా నామమాత్రమైన ఆఖరి టీ20 మంగళవారం రాత్రి జరగనుంది. తొలి టీ20లో 2 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టీ20లోనూ ఆశించిన మేర రాణించలేకపోయింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) వికెట్ చేజార్చుకోగా ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ (2), స్టీవ్‌స్మిత్ (10) త్వరగా అవుట్ అయ్యారు. అయితే.. కెప్టెన్ అరోన్ ఫించ్ ( 40: 33 బంతుల్లో 4x4, 2x6), స్టాయినిస్ (35: 26 బంతుల్లో 2x4, 2x6) ఫర్వాలేదనిపించారు. కానీ దూకుడుగా మాత్రం ఆడలేకపోవడంతో ఆస్ట్రేలియా 157/7తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్ జోస్ బట్లర్ ముందుండి ఇంగ్లాండ్ టీమ్‌ని నడిపించగా అతనికి డేవిడ్ మాలాన్ (42: 32 బంతుల్లో 7x4) నుంచి మంచి సపోర్ట్ లభించింది. మధ్యలో టామ్ బాంటన్ (2), ఇయాన్ మోర్గాన్ (7) నిరాశపరిచారు. కానీ ఆఖర్లో మొయిన్ అలీ (13 నాటౌట్: 6 బంతుల్లో 1x4, 1x6)‌తో కలిసి జోస్ బట్లర్ 18.5 ఓవర్లలోనే 158/4తో గెలుపు లక్ష్యాన్ని చేధించారు.

Tags :
|
|

Advertisement