Advertisement

కోహ్లీతో మాటల యుద్దానికి దిగకండి ..ఫించ్

By: Sankar Tue, 15 Dec 2020 09:17 AM

కోహ్లీతో మాటల యుద్దానికి దిగకండి ..ఫించ్


ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మరొక రెండు రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది..తొలి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో జరుగుతుంది...అయితే స్లెడ్జిన్గ్ కి మారుపేరు అయినా ఆస్ట్రేలియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో మాటలయుద్ధానికి దిగేముందు ఆలోచించాలి అని అన్నాడు ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఫించ్...

కోహ్లీ తో కలిసి ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కలిసి ఆడిన ఫించ్ మాట్లాడుతూ... పరిమిత ఓవర్ల సిరీస్ లో మైదానంలో కోహ్లీ రిలాక్స్ ‌గా ఉన్నాడు. కాబట్టి టెస్ట్ లో కూడా అలానే ఉండనివ్వండి. అతడిని స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నించకండి అని ఫించ్ ఆసీస్ ఆటగాళ్లను హెచ్చరించాడు.

అయితే తన భార్య జనవరిలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో ఈ మొదటి టెస్ట్ తర్వాత కోహ్లీ తిరిగి భారత్ కు రానున్నాడు. దీనితో తర్వాత జరిగే మూడు టెస్టులకు వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు..ఇక గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్ రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుండటం ఊరట కలిగించే అంశం..

Tags :
|
|
|

Advertisement