Advertisement

  • ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ...తొలి సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిక్యం ..

ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ...తొలి సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిక్యం ..

By: Sankar Thu, 17 Dec 2020 12:33 PM

ఇండియా ఆస్ట్రేలియా తొలి టెస్ట్ ...తొలి సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిక్యం ..


భారత జట్టు ఆసీస్ పర్యటనలో భాగంగా నేడు ఈ రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లోని మొదటి సెషన్ లో భారత్ పై ఆసీస్ ఆధిపత్యం కనబరిచింది.

ఆసీస్ పేస్ స్టార్ మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ పృథ్వీ షా(0) ను ఔట్ చేసి భారత్ కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా అలాగే మయాంక్ జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. కానీ మొదటి సెషన్ పూర్తయే ముందు మయాంక్(17) ను కమిన్స్ ఔట్ చేసాడు.

దాంతో భారత్ మొదటి రోజు మొదటి సెషన్ లో 41 పరుగులు చేసి రెండు వికెట్ లు కోల్పోయింది. ప్రస్తుతం పుజారా(17), కోహ్లీ (5) బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే పేలవ ఫామ్లో ఉన్న పృథ్వీ షా ను జట్టులోకి తీసుకోవడం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి..ఫామ్ లో ఉన్న గిల్ లేదా సీనియర్ ఆటగాడు అయినా రాహుల్ ను కాదని పృథ్వీ షా ను తీసుకోవడం మీద విమర్శలు గుప్పిస్తున్నారు

Tags :
|
|

Advertisement