బాక్సింగ్ డే టెస్ట్ ....విజయానికి చేరువలో టీమిండియా
By: Sankar Mon, 28 Dec 2020 12:45 PM
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా విజయవానికి దగ్గర్లో ఉంది..తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా , భారత బౌలర్ల దాటికి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 133 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది..కేవలం రెండు పరుగులు మాత్రమే లీడింగ్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన బ్యాట్సమెన్ అందరు పెవిలియన్ కి చేరారు...
ఒక దశలో 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఓటమి బాటలో పయనించిన ఆసీస్ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా.. బుమ్రా, ఉమేష్, సిరాజ్, అశ్విన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. మాథ్యూ వేడ్ 40 పరుగులు చేయగా.. లాబుషేన్ 28, హెడ్ 17 పరుగులు చేశారు.
ప్రస్తుతం మ్యాచ్లో టీమిండియాదే పైచేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగో రోజే మ్యాచ్ ముగిసే అవకాశాలు ఉన్నాయి.నాల్గో రోజు చివరి నాలుగు వికెట్లు ఎంత త్వరగా తీస్తే భారత్ విజయం అంత సులభం అయితుంది...చివరి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది కాబట్టి భారత్ చివరి నాలుగు వికెట్లు వెంటనే తీయాలని అభిమానులను ఆశిస్తున్నారు...