Advertisement

చెలరేగుతున్న భారత బౌలర్లు ..కష్టాల్లో ఆసీస్

By: Sankar Fri, 18 Dec 2020 2:45 PM

చెలరేగుతున్న భారత బౌలర్లు ..కష్టాల్లో ఆసీస్


టీమిండియాతో జరుగుతున్న పింక్‌ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 84 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్‌ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్నస్‌ లబుషేన్‌ 43 పరుగులతో, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ 4 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు.

అశ్విన్‌ బౌలింగ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అద్భుతంగా డ్రైవ్‌ చేస్తూ ఒడిసి పట్టుకున్నాడు. ఈ సూపర్‌ క్యాచ్‌ దెబ్బకు ఆసీస్‌ 5వ వికెట్‌ కోల్పోయింది. ఇక బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అయిన ఓపెనర్ పృథ్వీ షా ఫీల్డింగ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు ..లాబ్యూషన్ ఇచ్చిన సులభమయిన క్యాచ్ ను జారవిడిచాడు..

Tags :
|
|

Advertisement