తొలి వన్ డే లో ఆసీస్ ఘనవిజయం...
By: Sankar Fri, 27 Nov 2020 6:00 PM
ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా(90; 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 10 ఫోర్లు)లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించడంతో ఓటమి తప్పలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఫించ్(114;124 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు), స్టీవ్ స్మిత్(105; 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది...భారత ఫీల్డర్ల ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆసీస్ బాట్స్మెన్ కు బాగా కలిసి వచ్చింది...
లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. టీమిండియా ఇన్నింగ్స్ను మయాంక్ అగర్వాల్-శిఖర్ ధావన్లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్కు 10 పరుగుల రన్రేట్ను మెయింటైన్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు..అయితే మయాంక్ అగర్వాల్ , కోహ్లీ , అయ్యర్ , రాహుల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు ..ఇక ఆ తర్వాత పాండ్య , ధావన్ రాణించినప్పటికీ టీం ఇండియా కు ఓటమి తప్పలేదు...