చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా ...స్టార్ ఓపెనర్ వార్నర్ కు చోటు
By: Sankar Wed, 30 Dec 2020 5:52 PM
మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో దారుణ ఓటమి చవి చుసిన ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది...ఇందులో తొలి రెండు టెస్టులలో ఘోరంగా విఫలం అయిన జో బర్న్స్ ను జట్టు నుంచి తప్పించింది..ఇక గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రాగ , సీన్ అబాట్, విల్ పుకోస్కీలు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు.
రెగ్యులర్ ఓపెనర్ వార్నర్ గజ్జల్లో గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. టాప్ ఆర్డర్లో కీలకమైన వార్నర్పైనే ఆసీస్ భారీగా ఆశలు పెట్టుకుంది. సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కంకషన్కు గురైన పుకోస్కీ కోలుకొని మళ్లీ వచ్చాడు.
కాలి పిక్క కండరాలు గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ సీన్ అబాట్ కూడా పునరాగమనం చేశాడు. జట్టు నుంచి బర్స్న్ను విడుదల చేశామని, అతడు బ్రిస్బేన్ హీట్ జట్టులో చేరుతాడని సెలక్టర్ ట్రెవర్ హాన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.