Advertisement

ఐపీఎల్‌-2021 కు ఫిబ్రవరిలో వేలం

By: chandrasekar Wed, 23 Dec 2020 09:47 AM

ఐపీఎల్‌-2021 కు ఫిబ్రవరిలో వేలం


ఈ సంవత్సరం కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఆలస్యంగా యూఏఈ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. రానున్న సంవత్సరం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఫిబ్రవరి నెలలో మినీ వేలం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెల 24న అహ్మదాబాద్‌లో జరిగే బీసీసీఐ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌-2021 కు కొత్త టీం లను చేర్చే విషయంపై ఈ సమావేశంలో నిర్దారించనున్నారు.

వచ్చే సంవత్సరం నిర్వహించే ఐపీఎల్ వేలం కోసం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఇందుకుగాను జనవరి నెలలో 10 తేదీ నుండి 31 తేదీ వరకు టీ20 టోర్నమెంట్ నిర్వహించి అందులో మంచి ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆటగాళ్లు ఇప్పుడే ప్రాక్టీస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్లేయర్స్ ను సెలెక్ట్ చేయడానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడి వారి ప్రతిబల ఆధారంగా రకరకాల ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.

Tags :
|

Advertisement