Advertisement

హ‌ర్యానా వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో దారుణం...

By: chandrasekar Tue, 27 Oct 2020 5:36 PM

హ‌ర్యానా వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో దారుణం...


హ‌ర్యానా రాష్ట్రం దారుణం జ‌రిగింది. త‌న కారు ఎక్కుమంటే ఎక్క‌లేద‌ని ఓ వ్య‌క్తి ఓ యువ‌తిని కాల్చిచంపాడు. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డు మీద అంద‌రూ చూస్తుండ‌గానే వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే సోమ‌వారం సాయంత్రం వ‌ల్ల‌భ‌గ‌ఢ్‌కు చెందిన ఓ యువ‌తి కాలేజీలో ప‌రీక్ష రాసేందుకు బ‌య‌లుదేరింది. ఆమె రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఓ వ్య‌క్తి కారులో వ‌చ్చి త‌న కారు ఎక్కాల‌ని ఆమెను కోరాడు. అయితే అందుకు ఆమె నిరాక‌రించ‌డంతో తుపాకీతో కాల్చి పారిపోయాడు.

ఈ ఘ‌ట‌న‌పై మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా, నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల‌ని మృతురాలి బంధ‌వులు, స్నేహితులు పోలీస్ స్టేష‌న్ ఎదుట ధ‌ర్నాకు దిగారు.

Tags :

Advertisement