కర్నూలు జిల్లాలో దారుణం... యువకుడిపై యువతి రెండోసారి యాసిడ్ దాడి
By: chandrasekar Fri, 04 Sept 2020 9:51 PM
నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి... యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. గ్రామానికి చెందిన నాగేంద్ర మరో యువతి ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించిన తనను పెళ్లి చేసుకోలేదని అతడిపై కోపంతో ఉండగా అతడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కక్ష పెంచుకుంది.
అందుకే నాగేంద్రపై యాసిడ్ దాడి చేసింది. యువతి గత వారమే అతడిపై యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలగా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ గాయం నుంచి కోలుకోక ముందే తాజాగా మరోసారి యాసిడ్ దాడికి పాల్పడింది.
కుటుంబ సభ్యులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. దాడిలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యువకుడిపై వారం వ్యవధిలోనే రెండుసార్లు యాసిడ్ దాడి జరగడం సంచలనంగా మారింది.