Advertisement

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బాల్లియా జిల్లాలో దారుణం

By: chandrasekar Tue, 29 Sept 2020 7:08 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బాల్లియా జిల్లాలో దారుణం


ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్నాడ‌నే కోపంతో రాకేష్ అనే 21 ఏండ్ల యువ‌కుడిపై అమ్మాయి కుటుంబ‌స‌భ్యులు క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రాకేష్‌ను అతనిని కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ వైద్యులు చికిత్స మొద‌లుపెట్ట‌క‌ముందే అతను ప్రాణాలు కోల్పోయాడు.

బ‌ల్లియా జిల్లా రాస్రా ఏరియాలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జరిగింది. రాకేష్ కుటుంబ‌స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. కాగా, రాకేష్‌ను మాట్లాడుకుందాం ర‌మ్మ‌ని బ‌య‌టికి పిలిచి దాడికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Tags :

Advertisement