దారుణం...నిద్రిస్తున్న మూడునెలల పసికందును నోట కరుచుకెళ్లిన నక్క
By: chandrasekar Thu, 19 Nov 2020 2:37 PM
భద్రాద్రి
కొత్తగూఉయ్యాలలో నిద్రిస్తున్న మూడునెలల పసికందును నక్క నోట్లో కరుచుకొని
వెళ్లింది. ఈ ఘటన అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే వెంటనే తల్లిదండ్రులు
అప్రమత్తం కావడంతో విడిచిపెట్టి వెళ్లి పోయింది. ఒకరోజు ఆలస్యంగా వెలుగుచూసిన ఈ
దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పాల్వంచ మండల
కేంద్రానికి సుమారు 40 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ
రాళ్ల చెలక అని గిరిజన పల్లె ఉంది. ఈ గ్రామానికి చెందిన ముక్తి యడమ, రాధ
దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల
సమయంలో చిన్నారిని తల్లి నిద్రపుచ్చింది. పూరింటిలోని వంటగదిలో చీర ఉయ్యాల కట్టి
అందులో పడుకో పెట్టింది. అయితే తల్లిదండ్రులు లోపల పనిచేసుకుంటున్నారు.
కొద్దిసేపటికి
చెట్లపొదల్లోంచి వచ్చిన నక్క చిన్నారిపై దాడిచేసింది. గోళ్లతో రక్కిం.. పసికందు తల
భాగాన్ని నోట కరుచుకుని సుమారు పది అడుగుల దూరం లాక్కెళ్లింది. బిడ్డ కేకలతో
బయటకొచ్చిన తల్లిదండ్రులు నక్కను అదిలించారు. దీంతో అది పసికందును వదిలేసి
పారిపోయింది. అప్పటికే నక్క గోళ్లతో రక్కడంతో బిడ్డ ముఖం, తల
భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో
తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన
తరలించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు తలకు గాయమైన చోట కుట్లు
వేశారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో
చికిత్స అందించి తర్వాత డిశ్ఛార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. మరోవైపు నక్క
దాడితో ఒక్కసారిగా గిరిజనపల్లె భయభ్రాంతులై౦ది.