Advertisement

  • బెంగళూరులో హింసను ఖండించిన అసదుద్దీన్‌ ఓవైసీ

బెంగళూరులో హింసను ఖండించిన అసదుద్దీన్‌ ఓవైసీ

By: chandrasekar Thu, 13 Aug 2020 04:28 AM

బెంగళూరులో హింసను ఖండించిన అసదుద్దీన్‌ ఓవైసీ


కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరుగుతున్న హింసను ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ సోషల్‌మీడియా వేదికగా బుధవారం ఖండించారు. బెంగళూరులో హింసకు సంబంధించి అభ్యంతరకరమైన, అప్రియమైన సోషల్ మీడియా పోస్టులు ఖండించదగినవి. హింసకు పాల్పడొద్దని ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి బలపడుతుందని నేను నమ్ముతున్నాను అని అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వేగంగా పోస్టులు ప్రబలడంతో మరింత హింస చెలరేగింది.

కర్ణాటక లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై మంగళవారం రాత్రి బెంగళూరు నగరంలో హింస చెలరేగడంతో పొలిసు కాల్పుల్లో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడిన ఘటన తెలిసిందే. హింసకు సంబంధించి పోలీసులపై కాల్పులు, రాళ్లు రువ్వడం, దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 110 మందిని అరెస్టు చేశారు. నిందితుడు నవీన్‌ను కూడా అరెస్టు చేశారు. అభ్యంతరకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సమాజంలో హింసని ప్రోత్సహించినట్లవుతుందని తెలిపారు.

Tags :

Advertisement