మధ్యాహ్నం 3 గంటల వరకు దుబ్బాకలో 71.10 శాతం పోలింగ్ నమోదు
By: chandrasekar Tue, 03 Nov 2020 7:06 PM
దుబ్బాక ఉప ఎన్నికకు
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల
వరకు 71.10 శాతం
పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద
ఓటర్లు బారులు తీరి ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓటర్లకు ఓటేసేందుకు అనుమతి
ఇవ్వనున్నారు.
చివరి గంటలో మాత్రం కేవలం
కరోనా బాధితులకు ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను
ఎన్నికల అధికారులు పరిశీలించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో
మొత్తం 315
పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు
తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన 85 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పోలీసులు ఎలాంటి అవాంఛనీయ
ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో
మొత్తం 23 మంది
అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫలితం 10వ తేదీన తేలనుంది.