కరోనా వైరస్ సోకి ఏఆర్ఎస్ఐ మృతి
By: chandrasekar Wed, 22 July 2020 11:23 AM
నిజామాబాద్: తెలంగాణ
స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 7 వ బెటాలియన్లో పనిచేస్తున్న పోలీసు అధికారి
మంగళవారం ఉదయం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో
తుదిశ్వాస విడిచారు. మృతుడు మహ్మద్ హమీద్ (48)
అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా డిచ్పల్లి
ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతను ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డాడు. గత
కొన్ని రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు
పోలీసులు తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున
అతడి పరిస్థితి విషమం కావడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాలని
వైద్యులు సూచించారు. దాంతో అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా.. మేడ్చల్
సమీపంలోకి రాగానే పోలీసు అధికారి తుది శ్వాస విడిచారు. అతను బోధన్ స్థానికుడు. 1994 లో 7 వ
బెటాలియన్లో కానిస్టేబుల్గా చేరాడు. ఏఆర్ఎస్ఐ మహ్మద్ హమీద్ మరణం పట్ల
బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు.