శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్ట్
By: chandrasekar Tue, 07 July 2020 11:55 AM
శ్రీలంక స్టార్ క్రికెటర్
కుశాల్ మెండిస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం రాజధాని కొలంబోలోని
పానాదురా ప్రాంతంలో సైకిల్పై వెళ్తున్న ఓ వృద్ధుడిని కుశాల్ మెండిస్ కారు
ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స
పొందుతూ కొద్దిసమయానికే ఆ వృద్ధుడు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న కొలంబో
పోలీసులు కారు స్వాధీనం చేసుకుని, క్రికెటర్ కుశాల్ మెండిస్ ను అదుపులోకి తీసుకున్నట్లు
ఓ అధికారి వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో
కుశాల్ మెండిస్ మద్యం సేవించాడా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాయంత్రం
స్థానిక మెజిస్ట్రేట్ ఎదుట మెండిస్ను హాజరుపరిచారు. లాక్డౌన్ తర్వాత
ప్రారంభమయ్యే సిరీస్లకు బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్ను ఎంపిక చేయడం తెలిసిందే.
మార్చిలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు మెండిస్ ఎంపిక కాగా, కరోనా
వైరస్ కారణంగా సిరీస్ రద్దు కావడం తెలిసిందే. కుశాల్ మెండిస్ 44
టెస్టులు, 76
వన్డేల్లో లంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, 2001లో మాజీ స్పిన్నర్ కౌశల్ లోకురాచ్చి కారుతో ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. ఈ
కేసులో న్యాయస్థానం ఆ క్రికెటర్కు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. లంకలో ప్రతి
ఏడాది 3000 మంది
రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు.