కేవైసీ అప్డేట్ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుల అరెస్టు
By: chandrasekar Wed, 14 Oct 2020 7:03 PM
మంగళవారం సైబరాబాద్
పోలీసులు పేటీఎం కేవైసీ అప్డేట్ పేరిట ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను
అరెస్టు చేశారు. వినయ్శర్మ అనే బాధితుడిని నుంచి రూ.4.29
లక్షలు కొట్టేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
దీంతో దర్యాప్తు
ప్రారంభించిన పోలీసులు జార్కండ్ కేంద్రంగా ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఏడుగురిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.47 లక్షల
నగదు, మొబైల్
ఫొన్లు, క్రెడిట్
కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ పేర్కొన్నారు.
అపరిచిత వ్యక్తులకు
బ్యాంకుఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, ఆధార్ నెంబర్ తదితర
వివరాలు ఇవ్వవద్దని కోరారు. ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు
పోలీసుశాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.