Advertisement

  • ఉద్యమంలోకి సంఘ విద్రోహులు ప్రవేశిస్తే అరెస్ట్...

ఉద్యమంలోకి సంఘ విద్రోహులు ప్రవేశిస్తే అరెస్ట్...

By: chandrasekar Sat, 12 Dec 2020 8:10 PM

ఉద్యమంలోకి సంఘ విద్రోహులు ప్రవేశిస్తే అరెస్ట్...


కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలో శనివారం ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారులను రైతులు దిగ్బంధించేందుకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులను మూసివేసి వేలాది మంది పోలీసులను మోహరించారు.

ఎవరైనా ఉద్యమంలోకి ప్రవేశించి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది. ఆందోళనలపై వామపక్ష అతివాదులు సలహాలిస్తున్నారని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించినట్లు అధికారులు కేంద్రానికి తెలియజేసారు. అప్రమత్తమైన ప్రభుత్వం భద్రతను మరింత పటిష్టవంతం చేసింది. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ..తమ ఉద్యమంలోకి సంఘ విద్రోహులు ప్రవేశిస్తే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పారు. తామైతే ఇప్పటి వరకూ అలాంటి వారిని కనుగొనలేదని, ప్రభుత్వ వర్గాలు అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే అదుపులోకి తీసుకోని జైళ్లల్లో వేయాలని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement