కరోనా సోకకుండా జపాన్ బార్లలో స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్ ఏర్పాట్లు
By: chandrasekar Fri, 21 Aug 2020 09:23 AM
కరోనా సోకకుండా జపాన్ బార్లలో స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్ ఏర్పాట్లు చేయడం ద్వారా అటు కస్టమర్లు ఇటు బార్ సిబ్బంది సంతోష పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడంతో చాలా రోజులు హోటళ్లు మరియు బార్లు అన్ని చోట్ల మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం తలెత్తడంతో తగు జాగ్రత్తలు తీసికొని ఇప్పుడిప్పుడే వాటిని తెరుస్తున్నారు. అయితే వైరస్ సోకుతుందేమోననే భయంతో రెస్టారెంట్స్, హోటల్స్, బార్లకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు.
హోటళ్లకు మరియు బార్లకు ప్రజలను రప్పించడానికి వెరైటీ డిషెస్ చేస్తూ ఆఫర్స్ ప్రకటిస్తూ తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఓనర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా జపాన్లో ఓ బార్ ఇలాగే కస్టమర్స్కు కరోనా సోకకుండా వినూత్నంగా జాగ్రత్త చర్యలు తీసుకుంది. జాజ్ లాంగ్ ఎన్ కౌంటర్ అనే ఈ బార్ను జూన్లో పునః ప్రారంభం చేశారు. కస్టమర్స్ సేఫ్టీగా ఫీల్ అయ్యేందుకు సదరు బార్ నిర్వాహకులు ఇక్కడ స్పెషల్ ఫిష్ బౌల్ స్క్రీన్స్ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇలా ఏర్పాట్లు చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
బార్లలో కోనికల్ క్లియర్ అక్రిలిక్ స్క్రీన్స్ను కస్ట్మర్స్ తల, భుజాలను కవర్ చేసేలా పైనుంచి వేలాడేలా నిర్వాహకులు వాటిని అమర్చారు. ఈ షీట్స్ ఒక కస్టమర్కు మరో కస్టమర్కు మధ్య దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే సర్వర్స్ కూడా దూరం నుంచే సర్వ్ చేసేలా అరేంజ్మెంట్స్ చేశారు. దీనిపై కస్టమర్స్తోపాటు సర్వర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున నేను కస్టమర్స్తో సరిగ్గా మాట్లాడలేక పోయేవాడిని. కానీ ఈ జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేసిన తర్వాత నేను సురక్షితంగా భావిస్తున్నా అని 27
ఏళ్ల మాకో ఓకీ అనే స్టాఫ్ వర్కర్ చెప్పాడు. ఇందువల్ల కస్టమర్లు ఎటువంటి భయం లేకుండా హోటల్స్ మరియు బాట్లకు రావడానికి వీలవుతుంది.