సైన్యం సన్నద్ధత, కార్యాచరణపై ఆర్మీ చీఫ్ సమీక్ష
By: chandrasekar Fri, 18 Sept 2020 6:11 PM
జమ్ముకశ్మీర్లోని చినార్
కార్ప్స్ను గురువారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారవాణే సందర్శించారు. సైన్యం సన్నద్ధత, కార్యాచరణపై
ఆయన సమీక్షించారు. వృత్తి నైపుణ్యం, విధి పట్ల విధేయుత చూపుతున్న సైనికులను ఆయన
ప్రశంసించారు.
సరిహద్దులో చైనాతో
ఉద్రిక్తతలు, పాక్ వైపు నుంచి కవ్వింపు కాల్పుల నేపథ్యంలో ఆర్మీ
చీఫ్ జనరల్ ఎంఎం నారవాణే ఇటీవల పలు మార్లు దేశ సరిహద్దులోని సైనిక కేంద్రాలను
సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం
జమ్ముకశ్మీర్లో పర్యటించిన ఆయన అక్కడి సైనిక సన్నద్ధత, కార్యాచరణ
గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
మనోజ్ సిన్హాను కూడా చీఫ్ కలిశారు.
Tags :
army |
chief |
review |