పెళ్లిరోజుకి నాలుగురోజుల ముందు ప్రమాదవశాత్తు లారీ కిందపడి వ్యక్తి మృతి..
By: Sankar Fri, 18 Dec 2020 10:21 PM
రోడ్డుపై జరిగిన ఘర్షణలో తోపులాటవల్ల లారీ కిందపడి ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న 32 ఏళ్ల ఆర్కిటెక్ట్ సిద్దార్థ్ సోని గురువారం కారులో విధులకు వెళ్తున్నారు.
పలాసియా ప్రాంతంలో వికాస్ యాదవ్ స్కూటర్ను ప్రమాదవశాత్తు ఆయన ఢీకొట్టారు. సిద్దార్థ్ వెంటనే తన కారు నుంచి దిగి వికాస్కు క్షమాపణ చెప్పారు. అయితే వికాస్ కోపంతో దూషించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో సిద్దార్థ్ను వికాస్ తోసివేశాడు. కాగా అప్పుడే వారి ముందు నుంచి వెళ్తున్న డంపర్ లారీ వెనక చక్రాల కింద పడి సిద్దార్థ్ మరణించారు.
తొలి వివాహ వార్షికోత్సవానికి నాలుగు రోజుల ముందు ఆయన చనిపోవడంతో ఆ ఇంట విషాదం నెలకొన్నది. కాగా సిద్దార్థ్ మరణానికి కారణమైన వికాస్తోపాటు లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో వైరల్ అయ్యింది.