Advertisement

  • ఖేల్ రత్న కు నామినెట్ అయిన ఆర్చర్ జ్యోతి సురేఖ

ఖేల్ రత్న కు నామినెట్ అయిన ఆర్చర్ జ్యోతి సురేఖ

By: Sankar Wed, 03 June 2020 09:25 AM

ఖేల్ రత్న కు నామినెట్ అయిన ఆర్చర్ జ్యోతి సురేఖ

దేశ క్రీడా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ..ఏదయినా క్రీడలో వరుసగా నాలుగు సంవత్సరాల పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి ఈ అవార్డు ఇస్తారు ..ఇప్పటికే ఈ అవార్డు కు క్రికెట్ నుంచి హిట్మాన్ రోహిత్ శర్మ నామినెట్ అవ్వగా ..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్టార్ ఆర్చర్ తెలుగు తేజం జ్యోతి సురేఖను నామినెట్ చేసింది..

గత దశాబ్దకాలంగా ఇంటర్నేషనల్ లెవల్‌లో 33 పతకాలు సాధించిన సురేఖ పేరుని ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పంపింది. సురేఖతో పాటు యతిమరపు రజని (హాకీ) పేరుని అర్జున అవార్డు కోసం, భాస్కర్ బాబు (బ్యాడ్మింటన్) పేరుని ద్రోణాచార్య అవార్డు కోసం ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది.

jyothi surekha,archer,khelratna,andhrapradesh,highest sports honour ,రాజీవ్ గాంధీ ఖేల్ రత్న,  సురేఖ, యతిమరపు రజని , భాస్కర్ బాబు ,  రోహిత్ శర్మ, ఆర్చర్

ఆర్చరీలో సురేఖ సాధించిన 33 మెడల్స్‌లో 9 బంగారు, 13 రజతం, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇందులో ఏడు పతకాలు వరల్డ్‌‌కప్స్‌లో సాధించగా.. మూడు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో, రెండేసి పతకాలు జూనియర్ వరల్డ్‌కప్, దక్షిణ ఆసియా గేమ్స్‌లో గెలిచినవి. ఇక గత కొంతకాలంగా భారత ఆర్చరీ టీమ్‌ని నెం.1 స్థానంలో నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సురేఖకి.. 2017లోనే అర్జున అవార్డు వరించింది.

2019 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగతంగా పతకం గెలిచిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పిన జ్యోతి సురేఖ.. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో కొనసాగుతోంది.

Tags :
|

Advertisement