Advertisement

తెలంగాణాలో కరోనాతో మరో పోలీస్ అధికారి మృతి ..

By: Sankar Tue, 21 July 2020 8:43 PM

తెలంగాణాలో కరోనాతో మరో పోలీస్ అధికారి మృతి ..



తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు, డాక్టర్లు ఇలా అంతా కరోనా బారిన పడుతున్నారు. పోలీస్ శాఖలో కూడా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పలువురు పోలీసులు కూడా కరోనాకు బలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కరోనా బారిన పడి ఏఆర్ ఎస్ఐ ఒకరు మృతి చెందారు. రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ హమీద్‌ కరోనాతో మృతి చెందారు..

ఎస్‌ఐకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. నిజామాబాద్‌ నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మేడ్చల్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. దీంతో తిరిగి ఎస్‌ఐ మృతదేహాన్ని నిజామాబాద్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

హమీద్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హమీద్‌ మృతిపట్ల ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీసత్య శ్రీనివాస్‌ రావు సంతాపం తెలిపారు. ఎస్‌ఐ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బోధనకు చెందిన హమీద్.. 1994లో పోలీసు విభాగంలో చేరారు

Tags :
|
|
|
|

Advertisement